Skip to content
Uncategorized

నితిన్–సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రం పూజా కార్యక్రమంతో ఘన ప్రారంభం

May 6, 20269 second read

ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది.

నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

విభాగం వివరాలు
నటీనటులు నితిన్, రితికా నాయక్
సంగీతం సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం అనిత్ మదాడి
కళ జానీ షేక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సహ నిర్మాతలు ఉప్పుటూరి వెంకట్, వీఎంఆర్
నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ శ్రీకర స్టూడియోస్
పి ఆర్ ఓ లక్ష్మీవేణుగోపాల్
Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top