Skip to content
Movies

మే 15న థియేటర్లలోకి వస్తోన్న ‘రాక్షసపురం’: కె.ఎస్ రామారావు

May 11, 202613 second read

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కె.ఎస్ రామారావు మరోసారి స్పష్టం చేశారు.

 

విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. సెన్సార్ పూర్తయిన సందర్భంగా సినిమా గురించి కె.ఎస్ రామారావు స్పందిస్తూ..”ఈ సినిమాలోని మేకింగ్ విలువలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాం. సినిమాను మే 7న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ, మరిన్ని మెరుగైన థియేటర్లు, గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసేందుకు వీలుగా మే 15న విడుదల చేస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా ఈ తేదీ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఐపీఎల్ సందడి మరియు ఓటీటీల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. ‘రాక్షసపురం’ కచ్చితంగా ఆ కోవలోకి వస్తుంది. సెన్సార్ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని రామారావు ధీమా వ్యక్తం చేశారు.

నటీనటులు రాజ్ బి శెట్టి తదితరులు
దర్శకనిర్మాత డాక్టర్ రవి
సమర్పకులు కె.ఎస్ రామారావు
బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్
విడుదల తేదీ మే 15, 2026
Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top