‘హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశారు.
రోహిత్ సరాఫ్ చేరికతో ఈ చిత్రానికి మరింత అప్పీల్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ ‘మహాకాళి’ పాన్ ఇండియా రీచ్ను మరింత బలోపేతం చేయనుంది.
ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్స్తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
‘హను-మాన్’ విజయానంతరం భారతీయ మూలాలతో కూడిన సినిమా యూనివర్స్ ని విస్తరించాలనే ప్రశాంత్ వర్మ విజన్లో భాగంగా ‘మహాకాళి’ రూపొందుతోంది. ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్లు ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు
‘మహాకాళి’ అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తోంది.
















Comments (0)